- కరోనా ఎక్స్ గ్రేషియాను సరిగ్గా ఇవ్వకపోవడంపై అసహనం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించే విషయంలో రాజస్థాన్ సర్కారు తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. రాజస్థాన్ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్పై అసంతృప్తి వ్యక్తంచేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్దాఖలు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి నేతృత్వంలోని బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
‘‘కరోనా మహమ్మారితో చనిపోయిన వారి కుటుంబాలను దయతో చూడాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. వాటిని అమలు చేస్తామని మీరు గతంలో కూడా హామీ ఇచ్చారు. కానీ అమలు చేయలేదు. రాజస్థాన్రాష్ట్రం చేసేది దానం కాదు” అని పేర్కొంది. కరోనా ఎక్స్గ్రేషియాకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేయట్లేదంటూ అడ్వొకేట్ గౌరవ్పిటిషన్దాఖలు చేశారు.