
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయనకు చుక్కెదురైంది. రాహుల్ వేసిన పిటిషన్ ను సూరత్ సెషన్స్ కోర్టు డిస్మిస్ చేసింది. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూరాహుల్ గాంధీ వేసిన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏప్రిల్ 20 గురువారం రోజున విచారణ జరగగా రాహుల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ కేసులో రాహుల్ కు రెండేళ్ల పాటు జైలుశిక్ష పడటంతో ఎంపీ పదవిపై అనర్హత వేటు పడింది. రేపు గుజరాత్ హైకోర్టులో ఇదే కేసులో రాహుల్ పిటిషన్ వేయనున్నారు.
2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోడీ ఇంటిపేరుతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్కు చెందిన బీజేపీ నేత పూర్ణేశ్ మోదీ కోర్టులో కేసు దాఖలు చేశారు.