ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై సురేష్ రైనా బిగ్ హింట్.. ఏమ్మన్నారంటే?

ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై సురేష్ రైనా బిగ్ హింట్.. ఏమ్మన్నారంటే?

MS Dhoni: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల గుండె పగిలిపోయే వార్త ఇది.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన మ్యాచ్ తర్వాత సీఎస్‌కే మాజీ సారథి ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్‌పై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ అనంతరం తన స్నేహితుడు, మాజీ సహచరుడు సురేష్ రైనాతో ధోని మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఒక్క మ్యాచ్ ఆడని ధోనీ: 
ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయం కారణంగా మహేంద్ర సింగ్ ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే సోమవారం రాత్రి చెపాక్‌లో జరిగిన చివరి హోమ్ మ్యాచ్‌లో ఆయన మైదానంలోకి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ లాప్ ఆఫ్ ఆనర్ (Lap of Honour) నిర్వహించారు. ఈ సమయంలోనే సురేష్ రైనా అతడ్ని కలిసి వచ్చే ఏడాది (IPL 2027) కూడా ఆడాలని కోరారు.

ధోనీ– రైనా ఎమోషనల్ చాట్:
నువ్వు ఐపీఎల్ 2026కు మిస్డ్ కాల్ ఇచ్చావ్.. ఇది లెక్కలోకి రాదు.. వచ్చే ఏడాది నువ్వు కచ్చితంగా పునరాగమనం చేయాల్సిందే అని ధోనితో సురేష్ రైనా అన్నట్లు పేర్కొన్నాడు. దానికి ధోని స్పందిస్తూ.. 'లేదు భయ్యా.. బాడీ కాస్త వీక్‌గా ఉంది (సహకరించడం లేదు)' అని చెప్పాడు.. కానీ మేము ఆ మాట నమ్మడం లేదు, వచ్చే ఏడాది కూడా అతడు ఆడాలని కోరుకుంటున్నాట్లు మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో రైనా తెలిపారు. ధోని చివరిగా 'చూద్దాం..' అని అనడంతో చెన్నై ఫ్యాన్స్ ఇంకా ఆశలు వదులుకోలేదు.

►ALSO READ | ఈడెన్ గార్డెన్స్‌లో హిట్‌మ్యాన్ రచ్చ.. కేకేఆర్ కోచ్ను ఇమిటేట్ చేస్తూ క్లీన్ బౌల్డ్ చేసిన రోహిత్ 

సీఎస్‌కే ప్లేఆఫ్స్ ఛాన్స్ దెబ్బతీసిన SRH: 
చెపాక్ మైదానంలో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 70 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా, హెన్రిచ్ క్లాసెన్ (47) రాణించారు. ఈ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా, చెన్నై ఓటమితో ఆరో స్థానానికి పడిపోయి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.