బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్లో మరో ముగ్గురు
సూర్యాపేట/ బెల్లంపల్లి, వెలుగు: సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో శుక్రవారం ఒక్కరోజే 11 మంది కరోనా పేషెంట్లు మృతి చెందారు. చనిపోయినవారిలో ఆరుగురు 50 ఏండ్ల పైబడిన వారున్నారు. మొత్తం మృతుల్లో సూర్యాపేట పట్టణానికి చెందిన వాళ్లు నలుగురు ఉన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్లో ముగ్గురు చనిపోయారు. వీరిలో మంచిర్యాలలోని అశోక్నగర్కు చెందిన ఒకరు, జెండా వెంకటాపూర్కు చెందిన ఒకరు, పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన ఇంకొకరు ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్లో ఈ సెంటర్లో దాదాపు 40 మంది మృతి చెందారు. బుధవారం ఉదయం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు 12 మంది కరోనా పేషెంట్లు చనిపోయిన విషయం తెలిసిందే.