నుపుర్ శర్మకు బెదిరింపులు

నుపుర్ శర్మకు  బెదిరింపులు

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో తనను హత్య చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని.. బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నాయకురాలు నుపుర్ శర్మ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల ఓ టీవీ చర్చలో భాగంగా మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపడంతో బీజేపీ హైకమాండ్ ఆమెను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. సస్పెన్షన్ వేటు పడిన అనంతరం ఆమె ట్విట్టర్‌ వేదికగా క్షమాపణలు చెప్పారు.. ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే, వాటిని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. తన కుటుంబ భద్రత గురించి ఆందోళన చెందుతున్నానని తెలిపారు.  

మరిన్ని వార్తలు.. 

హ్యాట్సాఫ్ కండక్టరన్నా... నెటిజన్లు ఫిదా

ఐఫా 2022 అవార్డ్స్ విజేతలు వీరే..