సుజ్లాన్‌‌‌‌‌‌‌‌కు ఏఎంపీఐఎన్ నుంచి మూడో ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సుజ్లాన్‌‌‌‌‌‌‌‌కు ఏఎంపీఐఎన్ నుంచి మూడో ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని కర్నూలులో ఏర్పాటు చేసే 170.1 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్ కోసం ఏఎంపీఐఎన్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ నుంచి వరుసగా మూడో ఆర్డర్  సొంతం చేసుకున్నామని సుజ్లాన్ ఎనర్జీ శుక్రవారం (june 20) ప్రకటించింది.  

కాంట్రాక్ట్ ప్రకారం, సుజ్లాన్  54 అడ్వాన్స్డ్ ఎస్‌‌‌‌‌‌‌‌144 విండ్ టర్బైన్ జనరేటర్స్ (డబ్ల్యూటీజీల)ను సరఫరా చేస్తుంది. ఇవి  హైబ్రిడ్ లాటిస్ టవర్స్ (హెచ్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌టీ)తో ఉంటాయి. ప్రతి ఒక్కటి 3.15 మెగావాట్ల రేటెడ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. 

ప్రాజెక్ట్ నిర్మాణంలో  ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్లను సప్లయ్‌‌‌‌‌‌‌‌ చేయడం, ఇన్‌‌‌‌‌‌‌‌స్టలేషన్, ప్రారంభించడం, లాంగ్-టర్మ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ను సుజ్లాన్ చూసుకుంటుంది.  ఏఎంపీఐఎన్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ  నుంచి సుజ్లాన్‌‌‌‌‌‌‌‌ పొందిన మొత్తం ఆర్డర్లు 303 మెగావాట్లకి చేరాయి.