కాంగ్రెస్​లో చేరిన స్వర్ణ సుధాకర్ రెడ్డి

కాంగ్రెస్​లో చేరిన స్వర్ణ సుధాకర్ రెడ్డి
  • సీఎంను కలిసిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్

హైదరాబాద్, వెలుగు : మహబూబ్​నగర్ జిల్లా జడ్పీ చైర్​ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసంలో స్వర్ణ సుధాకర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా.. బీఆర్ఎస్​కు రాజీనామా చేసిన ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కూడా బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలో ఆయన కాంగ్రెస్​ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.