ప్రేమకు హద్దులు ఉండవని అంటారు. అదే విషయాన్ని రుజువు చేస్తూ ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఓ స్వీడిష్ మహిళ ఇండియాకు వచ్చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఎటాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్లో పరిచయమైన పవన్ కుమార్ను వివాహం చేసుకోవడానికి క్రిస్టెన్ లైబర్ట్ శుక్రవారం ఎటాకు చేరుకుంది. తల్లిదండ్రుల అంగీకారంతో వీరి పెళ్లి ఓ పాఠశాలలో హిందూ ఆచారాల ప్రకారం ఘనంగా జరిగింది. వైరల్ అవుతున్న వీరికి సంబంధించిన వీడియోలు క్రిస్టెన్ లైబర్ట్ భారతీయ వివాహ దుస్తులను ధరించి ఉంది. ఇదిలా ఉండగా వీరిద్దరూ గత పదేళ్ల క్రితమే అంటే 2012లో ఫేసుబుక్ లో పరిచయమయ్యారని సమాచారం. వీరి పెళ్లికి కూడా అతని కుటుంబీకులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. పిల్లల ఆనందంలోనే తమ సంతోషం దాగి ఉందని పవన్ తండ్రి గీతం సింగ్ అన్నారు. ఈ పెళ్లికి తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని చెప్పడం గొప్ప విషయం. అయితే డెహ్రాడూన్లో బీటెక్ పూర్తి చేసిన పవన్ కుమార్.. ఓ సంస్థలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు.