
హైదరాబాద్: సిటీలో డ్రగ్స్అమ్మడానికి వచ్చిన స్విగ్గీ డెలివరీ బాయ్ ని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మురళీధరన్ అనే వ్యక్తి బెంగళూర్ లో స్విగ్గీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంతో హైదరాబాద్ లోని కస్టమర్లకు ఎండీఎంఏ డ్రగ్ను అమ్మడానికి వచ్చి శంషాబాద్ వచ్చాడు. ఆర్జీఐ పీఎస్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతడిని ఎస్వోటీ , ఆర్జీఐ పోలీసులు పట్టుకుని సోదా చేశారు. అతని ప్యాంటు ఇన్నర్ జేబులో 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ నుదొరికింది. ఎండీఎంఏ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఆర్జీఐ పోలీసులు విచారణ చేస్తున్నారు.