కొత్త విద్యావిధానంలో టీసాట్ను భాగం చేయండి : టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి

కొత్త విద్యావిధానంలో టీసాట్ను భాగం చేయండి : టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి
  •     మంత్రి శ్రీధర్ బాబును కోరిన టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యావిధానంలో టీసాట్ నెట్ వర్క్​ను భాగస్వామిగా చేయాలని ఐటీ, ఇండస్ట్రీస్​మినిస్టర్ శ్రీధర్ బాబును టీసాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్​రెడ్డి కోరారు. విద్యాశాఖకు సంబంధించి ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యతో పాటు యూనివర్సిటీ స్థాయిలోను డిజిటల్​ కంటెంట్​ను అందిస్తున్నామని తెలిపారు. 

ఈ మేరకు బుధవారం ఆయన టీసాట్​ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​సాదిక్​తో పాటు మంత్రి శ్రీధర్​బాబును కలిసి ‘కొత్త విద్యా విధానంలో టీసాట్​ భాగస్వామ్యం’ పేరుతో రూపొందించిన విధివిధానాల డాక్యుమెంట్​ను అందజేశారు. విద్యా చానెళ్ల ప్రసారాల్లో 39 వేల వీడియోలు..14 కోట్ల వ్యూస్​తో టీసాట్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. 

భవిష్యత్​లో విద్యావ్యవస్థ డిజిటల్​పై ఆధారపడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని, దానిని దృష్టిలో పెట్టుకుని టీసాట్​ ప్రత్యేక ప్రణాళిక తయారు చేసిందని చెప్పారు. ఇటీవల ‘యాన్యువల్​స్టూడెంట్ కాంపిటీషన్స్-2025’ పేరుతో పోటీలు నిర్వహించామని, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్టూడెంట్లు, టీచర్లందరిని అందులో భాగస్వాములుగా చేశామని పేర్కొన్నారు. కాబట్టి కొత్త విద్యావిధానంలో టీసాట్​ను భాగస్వామిగా చేస్తే డిజిటల్ కంటెంట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.