ఆర్మూర్, వెలుగు : కరాటేను ఆత్మ రక్షణ కోసం వినియోగించుకోవాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈరవత్రి రాజశేఖర్ విద్యార్థులకు సూచించారు. శనివారం తైక్వాండోగ్రాండ్ మాస్టర్ కరాటే భోజన్న ఆధ్వర్యంలో ఆర్మూర్లో బెల్ట్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. కరాటే మాస్టర్ భోజన్న తో కలిసి 108 మంది విద్యార్థులకు బెల్ట్, సర్టిఫికెట్లు అందజేశారు.
ఇందులో బ్లూ బెల్ట్ విజేతగా ఆరుశ్, గ్రీన్ వన్ బెల్ట్ సాధించిన లలిత్, శ్రీ వర్ధన్, తేజ, సన్నీ, దుర్గ భవాని,లాస్య,అమూల్య, ఎం రక్షిత, విద్య, సిద్ధార్థ, అనిత , శ్రీజ బెల్ట్ సర్టిఫికెట్లను అందుకున్నారు. మిగతా 100 మంది విద్యార్థులు ఎల్లో బెల్ట్ సాధించారు. కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు డిష్ రాంప్రసాద్, కొండి రాంచందర్, టైలర్ వినోద్ పాల్గొన్నారు.
