తైపీ: ఇండియా స్టార్ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్.. తైపీ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ పోరులో వరల్డ్ 9వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 8–21తో ఐదోసీడ్ ఎంగ్ కా లాంగ్ అంగస్ (హాంకాంగ్) చేతిలో ఓడాడు. ఆంగస్తో ముఖాముఖిలో 6–5 ఆధిక్యంలో ఉన్న ప్రణయ్.. ఈ మ్యాచ్లో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. ఓపెనింగ్ గేమ్లో ఇద్దరు షట్లర్లు హోరాహోరీగా తలపడ్డారు.
అంగస్ సర్వీస్ తప్పిదం చేయడంతో బ్రేక్ టైమ్కు ఇండియన్ ప్లేయర్ రెండు పాయింట్ల లీడ్లో నిలిచాడు. అయినా హాంకాంగ్ ప్లేయర్ బేస్లైన్ గేమ్తో పాటు షార్ప్ డ్రాప్స్తో 19–19తో స్కోరు సమం చేశాడు. చివర్లో సుదీర్ఘంగా సాగిన ర్యాలీ అంగస్ సొంతం కావడంతో గేమ్ చేజారింది. రెండో గేమ్లో ప్రణయ్ పూర్తిగా తడబడ్డాడు. 7–2 లీడ్తో గేమ్ను మొదలుపెట్టిన అంగస్ ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు.