
తైపీ: ఇండియా టాప్ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్.. తైపీ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రణయ్ 21–9, 21–17తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచాడు. గత నెలలో మలేసియా మాస్టర్స్ టైటిల్ నెగ్గిన ఇండియన్ ప్లేయర్ అదే ఫామ్ను ఇక్కడా కంటిన్యూ చేశాడు. కేవలం 36 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేశాడు. సుదీర్ఘమైన ర్యాలీలు, బలమైన స్మాష్లతో పాటు కీలక సమయంలో క్రాస్ కోర్టు విన్నర్స్తో ప్రణయ్ చెలరేగాడు. శుక్రవారం జరిగే క్వార్టర్స్లో ప్రణయ్.. వరల్డ్ 9వ ర్యాంకర్ అంగుస్ ఎంగ్ కా లాంగ్ (హాంకాంగ్)తో తలపడతాడు. మరో మ్యాచ్లో క్వాలిఫయర్ పారుపలి కశ్యప్ 16–21, 17–21తో సు లీ యాంగ్ (తైపీ) చేతిలో ఓడాడు. మిక్స్డ్ డబుల్స్లో తెలుగమ్మాయి సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ 13–21, 18–21తో చియు సియాంగ్–లిన్ జియావో మిన్ (తైపీ) చేతిలో పరాజయం పాలయ్యారు. విమెన్స్ సింగిల్స్లో తన్యా కామత్ 11–21, 6–21తో టాప్సీడ్ తై జు యింగ్ (తైపీ) చేతిలో ఓడింది.