- పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ
ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. దేశంలో కుటుంబ రాజకీయాలను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఇవాళ మహారాష్ట్రలోని నాసిక్ లో భారీ రోడ్ షో నిర్వహించిన ప్రధాని.. అక్కడి ప్రజలకు ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఇవాళ నాసిక్ రావడం సంతోషంగా ఉంది. పంచవటి ప్రాంతంలో సీతారాములు గడిపారనే నమ్మకం ఉంది. రాముడు చాలాకాలంపాటు పంచవటిలో ఉన్నారు. అని మోదీ అన్నారు.
అనంతరం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తపోవన్ గ్రౌండ్లో నేషనల్ యూత్ ఫెస్టివల్ను మోదీ ప్రారంభించారు. ఈ నెల 22న అయోధ్య ప్రాణప్రతిష్ట సందర్భంగా అన్ని ఆలయాల్లో క్లీన్ నెస్ డ్రైవ్ ప్రారంభించాలని కోరారు.