తలసాని, ఎర్రబెల్లిలను బట్టలు ఊడదీసి కొట్టాలి

తలసాని, ఎర్రబెల్లిలను బట్టలు ఊడదీసి కొట్టాలి

హైదరాబాద్: క్యూ న్యూస్ ఆఫీసులో కంప్యూటర్లు ఎత్తుకెళ్లి.. మల్లన్నను దోషిగా చేసే కుట్ర జరుగుతుందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. మల్లన్న విడుదలచేయాలంటూ.. ఆయా పార్టీల నేతలు, మేధావులు కలిసి రౌండు టేబుల్ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. 

‘కేంద్ర ప్రభుత్వం కన్నా 10 రెట్లు ఎక్కువ నియంత ధోరణిలో కేసీఆర్ ప్రభుత్వం సాగుతుంది. మల్లన్నను కేవలం జర్నలిస్ట్‎గా చూడటం తగదు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్లు పంచిన టీఆర్ఎస్ అభ్యర్థిపై నైతికంగా విజయం సాధించిన వ్యక్తి మల్లన్న. మాట్లాడటమే తప్పు అయితే తలసాని, ఎర్రబెల్లి మాట్లాడే మాటలకు బట్టలు ఊడదీసి కొట్టాలి. కేసీఆర్ కోపంగా చూస్తే మనం ఉరిమి చూడటం నేర్చుకోవాలి. చట్టం తన పని తాను చేసుకుపోతే తప్పు లేదు. నాయకుల చిత్తం ప్రకారం పనిచేస్తే.. మే కూడా చట్టం ప్రకారమే కొట్లాడుతం. తెలంగాణలో నైజాం సర్కార్ నడుస్తుంది. అందుకే నాడు రఘు, నేడు మల్లన్నను ప్రభుత్వం కిడ్నాప్ చేసింది. అవినీతిని, భూ కబ్జాలను ప్రశ్నించడం తప్పేం కాదు. లెఫ్ట్ నుండి రైట్ వరకు అన్ని పార్టీలు మల్లన్న విడుదలకు కలిసిరావాలి’ అని చెరుకు సుధాకర్ అన్నారు.