పద్మారావునగర్, వెలుగు: మూడోసారి అధికారంలోకి వస్తామని... అభివృద్ధి, సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగిస్తామని సనత్నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం రాంగోపాల్ పేట డివిజన్ కాచిబౌలి, గైదన్ బాగ్, నల్లగుట్ట, టొబాకో బజార్, కటిక బస్తీల్లో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. వాన పడుతున్నా తన ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో దేశంలోని ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు.
ఆయన వెంట సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ, కిరణ్మయి, డివిజన్ బీఆర్ఎస్అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, పార్టీ నేతలు ఉన్నారు. బన్సీలాల్ పేట డివిజన్ బోయిగూడ లోని మసీద్ వద్ద ముస్లింల ఆత్మీయ సమావేశానికి తలసాని శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. కార్పొరేటర్ కుర్మ హేమలత, జిలానీ, ఉమర్ పాల్గొన్నారు రేపు పరేడ్ గ్రౌండ్లో జరిగే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను తలసాని శ్రీనివాస్ పరిశీలించారు.