
ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’లో ఇంపార్టెంట్ రోల్ చేసిన తమిళ నటుడు బాబీ సింహా.. ‘వసంత కోకిల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. రమణన్ పురుషోత్తమ్ దర్శకుడు. ‘నర్తనశాల’ ఫేమ్ కాశ్మీర పరదేశీ హీరోయిన్. రజనీ తాళ్లూరి, రేష్మి సింహా కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ను చిరంజీవి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ట్రైలర్ థ్రిల్లింగ్గా ఉంది. క్యూరియాసిటీని పెంచుతుంది. ఇది ఒకరోజు రాత్రి జరిగే స్టోరీ. డిఫరెంట్ జానర్స్ ఇష్టపడే వారికి కచ్చితంగా నచ్చుతుంది. పెద్ద విజయం సాధించాలని కోరుతున్నా’ అన్నారు.