- ఆర్డినెన్స్కు తమిళనాడు గవర్నర్ ఓకే
చెన్నై: గవర్నమెంట్ స్కూల్స్లో చదివి నేషనల్ ఎల్జిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) క్వాలిఫై అయిన స్డూడెంట్స్కు ఇక నుంచి తమిళనాడులోని మెడికల్ కాలేజీ సీట్లలో 7.5 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. ఈ మేరకు ప్రభుత్వం రూపొందించి, అప్రూవ్ చేసిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఆమోదించారని గవర్నర్ ఆఫీస్ శుక్రవారం ప్రకటించింది. బిల్లుపై సొలిసిటర్ జనరల్కు ఒపీనియన్ కోరారని, అక్టోబర్29న ఒపియన్ రాగానే గవర్నర్ ఆమోదం తెలిపారని అన్నారు. బిల్లును కావాలనే ఆలస్యం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో రాజ్భవన్ క్లారిటీ ఇచ్చింది. 2020–21 అకడమిక్ ఇయర్లోనే ఇది అమలవుతుందని అధికారులు చెప్పారు.