- ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు నో ఎంట్రీ
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన ‘చలో ట్యాంక్బండ్’ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పర్ ట్యాంక్బండ్ను మూసేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు, వివిధ పార్టీల నేతలు, ఆందోళనకారులు ట్యాంక్బండ్, పరిసర ప్రాంతాల్లో అడ్డంకులు సృష్టించే అవకాశం ఉండడంతోనే అక్కడికి వాహనాల రాకపోకలను నిలిపేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ రోడ్డుగుండా వెళ్లే వాళ్లు వేరే రూట్లలో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపు
- సికింద్రాబాద్ నుంచి ట్యాంక్బండ్ వైపు వచ్చే వాహనాలు: కర్బాలా మైదానం, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్రోడ్స్, సీజీఓ టవర్స్, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్ మీదుగా..
- ఆర్టీసీ క్రాస్రోడ్ నుంచి ఇందిరా పార్క్ వైప:- అశోక్నగర్ క్రాస్రోడ్స్ మీదుగా..
- తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వాహనా లు: ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి వైపుకు మళ్లింపు
- ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్ వైపు: తెలుగు తల్లి ఫ్లై ఓవర్ లెఫ్ట్ తీసుకుని నెక్టెస్ రోటరీ, నెక్లెస్ రోడ్ మీదుగా వెళ్లాలి.
- హిమాయత్నగర్ ‘వై’ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు:- లిబర్టీ జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకుని బషీర్బాగ్ వైపు వెళ్లాలి.
- ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే ట్రాఫిక్: బషీర్బాగ్ నుంచి పీసీఆర్ జంక్షన్, బీజేఆర్ విగ్రహం మీదుగా వెళ్లాలి.
- ఎస్బీహెచ్ గన్ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలు: బీజేఆర్ విగ్రహం నుంచి కేఎల్కే బిల్డింగ్ వైపు మళ్లింపు
- ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి: నెక్లెస్ రోటరీ వద్ద మింట్ కాంపౌండ్ లేన్ వైపు వెళ్లాలి