స్పీకర్ తొలగింపు తీర్మానంపై మార్చి 9న చర్చ, ఓటింగ్ : కేంద్ర మంత్రి రిజిజు

స్పీకర్ తొలగింపు తీర్మానంపై మార్చి 9న చర్చ, ఓటింగ్ : కేంద్ర మంత్రి రిజిజు
  •     బడ్జెట్ రెండో సెషన్ మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు: కేంద్ర మంత్రి రిజిజు

తవాంగ్: లోక్‌‌‌‌సభ స్పీకర్ ఓమ్ బిర్లాను తొలగించే అవిశ్వాస తీర్మానంపై మార్చి 9న చర్చ జరగనుంది, ఆ తర్వాత ఓటింగ్ ఉంటుంది. బడ్జెట్ సమావేశాల రెండో విడత ప్రారంభమైన రోజునే ఇది ఉంటుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆదివారం అరుణాచల్​ప్రదేశ్​లోని తన నియోజకవర్గం తవాంగ్​లో పర్యటించిన రిజిజు మీడియాతో మాట్లాడారు. 

బడ్జెట్ సెషన్ రెండో భాగం మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉంటుందన్నారు. రెండో సెషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని.. పలు బిల్లులతో పాటు ఒక కీలక బిల్లు పార్లమెంట్‌‌‌‌లో చర్చకు వస్తుందన్నారు. ప్రతిపక్షాలు మొదటి సెషన్​లోలా నిరసనలు చేస్తే, అది వారికే నష్టమన్నారు.  ప్రతిపక్షాలు హౌస్ నడవనివ్వకపోతే, గిలటిన్ పద్ధతిలో ముందుకు వెళ్తామని రిజిజు చెప్పారు. ప్రతిపక్షాలలో ఐక్యత లేదని పేర్కొన్నారు.