కామారెడ్డి లో  ఫిబ్రవరి 17న జాబ్ మేళా

కామారెడ్డి లో  ఫిబ్రవరి 17న జాబ్ మేళా

కామారెడ్డిటౌన్​, వెలుగు :  కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ నెల 17న జాబ్​ మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్​ వి.విజయ్​కుమార్​ తెలిపారు.  టీఎస్​కేసీ ఆధ్వర్యంలో మ్యాజిక్​ బస్​ ఇండియా ఫౌండేషన్​ సహకారంతో కాలిబ్యార్​, జస్ట్ డయల్, డీబీఎస్​ బ్యాంక్​,  జీయో, డిజిటల్​, ముత్తుట్​ ఫైనాన్స్​ , మెడ్​ప్లస్​​లో ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు.

ఏదైనా ఇంటర్​, డిగ్రీ, బీటెక్​, బీఫార్మసీ,. పీజీలో 50 శాతం మార్కులతో ఫాస్​ అయి, 30 ఏండ్ల లోపు  వయస్సు ఉన్న వారు అర్హులని తెలిపారు.  ఈ నెల 17న ఉదయం 10.30 గంటల లోపు  అభ్యర్థులు బయోడెటా, సర్టిఫికేట్లతో కాలేజీకి  రావాలన్నారు.