వర్ధన్నపేట, వెలుగు: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఐదో వార్డు నుంచి ఇండిపెండెంట్కౌన్సిలర్గా గెలిచిన శిభారాణి ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో చేరితేనే వార్డు అభివృద్ధి సాధ్యమని నమ్మి చేరినట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్మహమ్మద్ అయూబ్, నాయకులు బండి చైతన్య రెడ్డి, రాందాన్ నాయక్, బావుసింగ్ పాల్గొన్నారు.
