బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై తరుణ్ చుగ్ క్లారిటీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై తరుణ్ చుగ్ క్లారిటీ

తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులంతా కీలక బాధ్యతల్లో ఉంటారని బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన  రాష్ట్ర బీజేపీ నాయకత్వం సమిష్టిగానే ఉందని, కొందరు గిట్టని వాళ్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం  చేస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలున్నాయనడం అవాస్తవమని  కొట్టిపారేశారు.

నితీశ్ నేతృత్వంలో జరిగే విపక్షాల భేటీకి కేసీఆర్ కూడా హాజరవుతున్నారని చెప్పారు. దీనికి పీసీసీ చీఫ్ రేవంత్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీ టీంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. మరి కొన్ని సందర్బాల్లో సీ టీంగా కూడా పోటీ పడుతోందంటూ విమర్శించారు.