బాధితురాలి పక్షాన బీజేపీ పోరాడుతుంది

బాధితురాలి పక్షాన బీజేపీ పోరాడుతుంది

సీఎం కేసీఆర్ పైన ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్. రాష్ట్రంలో మహిళలపై ఘోరమైన అత్యాచారలు  జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంపై  కేసీఆర్ దృష్టి పెట్టాలని అన్నారు. జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం ప్రభుత్వ వాహనాలలో జరిగిందని, నిందితులని ముఖ్యమంత్రి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసుల వైఖరిని కూడా తప్పుబట్టారాయన. రక్షక భటులే భక్షక భటులుగా మారారని, కేసును పక్కదారి పట్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఈ కేసులో న్యాయం జరిగే వరకు బాధితురాలి పక్షాన బీజేపీ పోరాడుతుందని ఆయన తెలిపారు.