విమాన ప్రమాద బాధితులకు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నివాళి

విమాన ప్రమాద బాధితులకు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నివాళి

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ చైర్మన్‌‌‌‌ ఎన్ చంద్రశేఖరన్ శుక్రవారం (June 20) కంపెనీ 80వ యాన్యువల్ జనరల్ మీటింగ్‌‌‌‌ (ఏజీఎం)లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధితులకు నివాళి అర్పించేందుకు మేనేజ్‌‌‌‌మెంట్, షేర్‌‌‌‌హోల్డర్లతో కలిసి ఒక నిమిషం మౌనం పాటించారు. టాటా సన్స్ చైర్మన్‌‌‌‌ కూడా అయిన చంద్రశేఖరన్, గత సంవత్సరం మరణించిన టాటా గ్రూప్ మాజీ చైర్మన్‌‌‌‌ రతన్ టాటాను గ్రూప్ చాలా మిస్ అవుతుందని పేర్కొన్నారు.

 ఈ ఏడాది జూన్ 12న జరిగిన  విమాన ప్రమాదం తర్వాత చంద్రశేఖరన్ హాజరైన మొదటి టాటా గ్రూప్ కంపెనీ ఏజీఎం ఇది. ఈ వారం ముందు జరిగిన టీసీఎస్‌‌‌‌, టీసీపీఎల్‌‌‌‌ ఏజీఎంలకు ఆయన హాజరు కాలేదు. చంద్రశేఖరన్ మాట్లాడుతూ, “ఇక నుంచి గ్లోబల్‌‌‌‌ ఆర్థిక వ్యవస్థలో వోలటాలిటీ కొనసాగుతుంది.  జియోపొలిటికల్ టెన్షన్లు, మిలిటరీ గొడవలు, సప్లయ్‌‌‌‌ చెయిన్‌‌‌‌కు అంతరాయం ఏర్పడడం, టారిఫ్ వార్‌‌‌‌‌‌‌‌, ఏఐ, గ్రీన్‌‌‌‌ ఎనర్జీకి మారుతుండడం వంటివి ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావం ఆటోమోటివ్ సెక్టార్‌‌‌‌లో ఎక్కువగా కనిపిస్తుంది” అని అన్నారు. 

గత కొన్ని నెలలు నష్టాలతో నిండి ఉన్నాయన్నారు.  “గత సంవత్సరం చివర్లో రతన్ టాటాను కోల్పోయాం. ఆయన నాయకత్వంలో గ్రూప్ విస్తరించింది. కానీ విలువలకు కట్టుబడి ఉంది. ఆయన నాకు స్నేహితుడు, గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి. ఆయన్ని చాలా మిస్ అవుతాను” అని చంద్రశేఖరన్ వివరించారు.

టాటా మోటార్స్ డీమెర్జర్‌‌‌‌‌‌‌‌

టాటా మోటార్స్‌‌‌‌ డీమెర్జర్ ప్రాసెస్ జరుగుతోందని, ఈ క్యాలెండర్ ఇయర్ చివరి నాటికి కమర్షియల్ వెహికల్స్, ప్యాసెంజర్ వెహికల్స్ (జేఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ కలిపి).. రెండు స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా విడదీస్తామని చెప్పారు. “గత కొన్ని సంవత్సరాల్లో మేం ఈ బిజినెస్‌‌‌‌ను బాగా బలపరిచాం.  కమర్షియల్ వెహికల్స్, ప్యాసెంజర్ వెహికల్స్, జేఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ —ప్రతి బిజినెస్‌‌‌‌  ఫైనాన్షియల్‌‌‌‌గా స్ట్రాంగ్‌‌‌‌గా ఉంది. 

స్వతంత్ర మేనేజ్‌‌‌‌మెంట్ టీమ్స్‌‌‌‌తో సొంత స్ట్రాటజీలతో పనిచేస్తున్నాయి” అని చంద్రశేఖరన్ చెప్పారు. 2024–25 లో ఆర్థిక పరిస్థితుల బాగోలేకపోయినప్పటికీ  టాటా మోటార్స్ మంచి పనితీరు కనబరిచింది. కన్సాలిడేటెడ్ బేసిస్‌‌‌‌పై,  కంపెనీ రికార్డ్ లెవెల్లో రూ. 4,39,695 కోట్ల రెవెన్యూ సాధించింది. రూ. 57,649 కోట్ల ఇబిటా, రూ. 34,330 కోట్ల  ప్రాఫిట్ (ట్యాక్స్‌‌‌‌లకు ముందు) పొందింది. 2024–25 కోసం  ఒక్కో  షేర్‌‌‌‌కు రూ. 6 ఫైనల్ డివిడెండ్‌‌‌‌ను  సిఫారసు చేసింది.