టీసీఎస్ లే ఆఫ్లపై కేంద్రం నజర్

టీసీఎస్ లే ఆఫ్లపై కేంద్రం నజర్
  • పరిస్థితిని గమనిస్తున్న ఐటీ మంత్రిత్వ శాఖ 

న్యూఢిల్లీ: మిడ్​, సీనియర్​ లెవెల్స్​కు చెందిన 12 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తామని  టీసీఎస్​ ప్రకటించిన తర్వాత జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. 

 ఎంప్లాయ్​మెంట్​ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి కార్యక్రమాలు ఈ విషయంలో ఏమైనా సహాయపడతాయా ? అనే కోణంలో ఆలోచిస్తున్నది. ఐటీ మంత్రిత్వ శాఖ టీసీఎస్​తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నిర్ణయం వెనుక కారణాలను లోతుగా స్టడీ చేస్తోంది. మరోసారి ట్రెయినింగ్​ఇచ్చి ఉద్యోగాన్ని కొనసాగించడం గురించి కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. టీసీఎస్​ నిర్ణయంపై కొన్ని ఉద్యోగ సంఘాలు కేంద్ర కార్మికశాఖకు ఫిర్యాదు చేశాయి. ఇదిలా ఉంటే, టీసీఎస్​ బాటలోనే మరిన్ని కంపెనీలు ఉద్యోగాలకు కోత పెట్టే అవకాశం ఉందని ఐటీ సెక్టార్​ ఎక్స్​పర్టులు అంటున్నారు.