హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని సీఎం జగన్‌కు బాలకృష్ణ లేఖ

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని సీఎం జగన్‌కు బాలకృష్ణ లేఖ

అనంతపురం జిల్లా: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ .. సీఎం జగన్, సీఎస్ నీలం సాహ్నీలకు విడివిడిగా లేఖలు రాశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని కోరారు. హిందూపురం జిల్లా కేంద్రమైతే అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని సూచించారు. హిందూపురం నియోజకవర్గం మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. మాల్గురులో అందుకు సరిపడా భూమి అందుబాటులో ఉందన్నారు. సీఎం, సీఎస్‍తో పాటు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి బాలకృష్ణ లేఖలు రాశారు.