ఉగాది రోజు TDP మేనిఫెస్టో: చంద్రబాబు

ఉగాది రోజు TDP మేనిఫెస్టో: చంద్రబాబు

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలోని టీడీపీ వారిపై కేంద్ర వ్యవస్థలతో మోడీ దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి ప్రజలు ఓటుతోనే తగిన బుద్దిచెప్పాలన్నారు. ఉగాది సందర్భంగా TDP మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ఇవాళ(శనివారం) అమరావతిలో పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌ సందర్భంగా తెలిపారు. పౌరుషానికి ప్రతీకగా శనివారం సాయంత్రం కాగడాల ప్రదర్శన నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఎలాంటి కుట్రలనైనా ఎదుర్కొంటామనే స్ఫూర్తితో, తెలుగుజాతి కీర్తిని చాటుతూ ఈ కాగడాల ప్రదర్శన సాగాలని దిశానిర్దేశం చేశారు.

ఈ నెల 7న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రార్ధనలు, పూజలు నిర్వహించాలని, కుట్రలపై సర్వమతాలు తమకు అండగా నిలుస్తాయన్నారు సీఎం చంద్రబాబు. 8,9 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి వీర తిలకం దిద్ది పౌరుషాన్ని రగిలింపచేయాలని సూచించారు. క్యారెక్టర్‌ లేని వారంతా YCPలోనే ఉన్నారన్నారు. పొలవరం అడ్డుకునేందుకు కోర్టులో కేసులు వేశారని వీటన్నింటినీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు.