సార్వత్రిక సమ్మెకు టీచర్ల మద్దతు

సార్వత్రిక సమ్మెకు టీచర్ల మద్దతు

వనపర్తి టౌన్, వెలుగు: రైతులు, కార్మికులు ఈ నెల 16న నిర్వహించ తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మద్దతు తెలిపింది. గురువారం సంఘం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా  ఉపాధ్యాయ సంఘాల నాయకులు రవి ప్రసాద్ గౌడ్, కృష్ణయ్య, మద్దిలేటి మాట్లాడుతూ ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతుల డిమాండ్లను వెంటనే తీర్చాలని కోరారు. సమ్మెకు సంఘీభావంగా శుక్రవారం  స్కూళ్లలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలియజేయాలని కోరారు. వెంకటేశ్, శ్రీనివాసులు, శాంతన్న, చిరంజీవి, బి నరేందర్, మురళి, లక్ష్మణ్ గౌడ్, వెంకటేశ్,  నారాయణ, శివారెడ్డి పాల్గొన్నారు.