ప్రకృతి ఒడిలో చిన్నారులకు చదువు

ప్రకృతి ఒడిలో చిన్నారులకు చదువు

కరోనా కల్లోలంతో చిన్నారుల చదువులు తల్లకిందులైపోయాయి. స్కూళ్లు మూతపడటంతో స్టూడెంట్లు పుస్తకాలకు దూరమైపోయారు. కొన్ని రాష్ట్రాల్లో బడులు తెరిచినా ఇప్పటికీ కరోనా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్​లో సరికొత్త ప్రయత్నం చేశారు. ఇప్పటికే అక్కడ ఆన్​లైన్​ క్లాసులు స్టార్ట్​ అయ్యాయి. కానీ, చాలా మంది చిన్నారులకు స్మార్ట్​ఫోన్లు లేకపోవడం.. కొన్ని చోట్ల నెట్​వర్క్​ ఇబ్బందుల కారణంగా చిన్నారులు క్లాసులు వినలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం బారాముల్లా జిల్లాలోని తంగ్​మాంగ్​ ఏరియాలోని ఓ గవర్నమెంట్​ మిడిల్​ స్కూల్​లో ఓపెన్​ ఎయిర్​ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రకృతి ఒడిలో చిన్నారులకు చదువు చెబుతున్నారు అక్కడి గవర్నమెంట్​ స్కూల్​ టీచర్లు.