
బెకెన్హామ్ (యూకే): అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి టీమిండియా ఆటగాళ్లు సంతాపం ప్రకటించారు. శుక్రవారం మొదలైన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్కు ముందు ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. మ్యాచ్లో భుజానికి నల్ల బ్యాండ్లు ధరించారు. ఇక ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు లార్డ్స్లో ఒక నిమిషం మౌనం పాటించారు.
దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్స్టాలో షేర్ చేసింది. ఇరుజట్ల ప్లేయర్లు కూడా బ్లాక్ ఆర్మ్ బ్యాండ్ ధరించారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాతో సహా పలువురు ప్లేయర్లు ఈ ప్రమాదంపై సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని ప్రకటించారు. ‘అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇది హృదయ విదారకరంగా అనిపించింది. ఎంతో విషాదకరమైన సంఘటన. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో వాళ్ల ఫ్యామిలీకి దేవుడు బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని సచిన్ టెండూల్కర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు.