రాహుల్ కెప్టెన్సీలో జింబాబ్వే వన్డే సిరీస్

రాహుల్ కెప్టెన్సీలో జింబాబ్వే వన్డే సిరీస్

న్యూఢిల్లీ: మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం టీమిండియా.. శనివారం జింబాబ్వే బయలుదేరి వెళ్లింది. చీఫ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌గా ఎన్‌‌‌‌‌‌‌‌సీఏ హెడ్‌‌‌‌‌‌‌‌ వీవీఎస్‌‌‌‌‌‌‌‌ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌.. టీమ్‌‌‌‌‌‌‌‌తో పాటు వెళ్లాడు. పేసర్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌, ధవన్‌‌‌‌‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ, రుత్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌ ఫొటోలను బీసీసీఐ ట్విటర్​లో పెట్టింది. కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్ కెప్టెన్సీలో ఇండియా  టీమ్‌‌‌‌‌‌‌‌ ఈ నెల 18, 20, 22న హరారే స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌లో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడనుంది. ఐసీసీ వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఆడనున్న ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ జింబాబ్వేకు చాలా ప్రధానమైంది. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో రాణిస్తే జింబాబ్వే.. వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌–8 టీమ్స్‌‌‌‌‌‌‌‌లో చోటుతో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా క్వాలిఫై అవుతుంది. ఆతిథ్య హోదాలో ఇండియా మెగా టోర్నీకి ఇప్పటికే క్వాలిఫై అయ్యింది.