‘పుష్ప ది రైజ్’తో పాన్ ఇండియా వైడ్గా పాపులారిటీ అందుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. భారీ అంచనాల మధ్య సుకుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో.. సినిమాలోని జాతరకు సంబంధించిన సీన్స్ను చిత్రీకరించారు. అయితే కొన్ని రోజుల క్రితం షూటింగ్కు షార్ట్ బ్రేక్ ఇచ్చిన టీమ్.. తిరిగి సోమవారం నుంచి సెట్స్లో జాయిన్ అవుతున్నారట.
ఈ షెడ్యూల్లో బన్నీతో పాటు ముఖ్య పాత్రధారులంతా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్లో నటించిన నటీనటులే దాదాపు ఇందులోనూ నటిస్తున్నారు. పుష్ప రాజ్ భార్యగా శ్రీవల్లి పాత్రలో రష్మిక కనిపించనుండగా, ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ మరింత స్ట్రాంగ్గా ఉండబోతోందని టీమ్ చెబుతోంది. జగదీష్, అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న వరల్డ్ వైడ్గా విడుదల కానుంది.