భద్రాచలం,వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 27న జరిగే శ్రీరామనవమి సీతారాముల కల్యాణానికి ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా కోరు కొండకు చెందిన భక్తులు ఆదివారం కోటి గోటి తలంబ్రాలను సమర్పించారు. ఈవో దామోదర్రావు, ఏఈవో శ్రావణ్కుమార్లు కోరుకొండ భక్త బృందం అప్పారావు ఆధ్వర్యంలో తెచ్చిన తలంబ్రాల శోభాయాత్ర నిర్వహించారు.
తలంబ్రాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్కు చెందిన చలువాది మల్లి విష్ణు వందన బియ్యపు గింజలపై రాసిన రామకోటి తలంబ్రాలను అందజేశారు. 2016 నుంచి రామకోటి తలంబ్రాలను సమర్పిస్తున్నారు. కాగా ఆదివారం భక్తులతో రామాలయం కిటకిటలాడింది. గర్భగుడిలో సీతారామయ్యకు పంచామృతాలతో అభిషేకం చేసి బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు.
