కోహ్లీ వచ్చేశాడు..

కోహ్లీ వచ్చేశాడు..

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ దాదాపు రెండు నెలల తర్వాత ఇండియాలో అడుగుపెట్టాడు. తన భార్య అనుష్క డెలివరీ కారణంగా ఇన్నాళ్లూ లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండిపోయిన అతను శనివారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నాడు. ఈ మేరకు కోహ్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బయటకు వస్తున్న ఫొటోను ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాయి.

త్వరలోనే అతను ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొననున్నాడు. ఈ నెల 19న చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్స్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కోహ్లీ పాల్గొంటాడు. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రావిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిశాడు. రంజీ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత నొప్పితో ఇబ్బందిపడ్డ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడతాడో లేదో అన్న అనుమానాలు తలెత్తాయి.