
- సర్వీస్ సెంటర్ల వద్ద కస్టమర్ల బారులు
బషీర్ బాగ్, వెలుగు: సిటీలోని హిమాయత్ నగర్, లిబర్టీ వన్ప్లస్ సర్వీస్ సెంటర్ల వద్ద కస్టమర్లు గురువారం బారులు తీరారు. సాఫ్ట్వేర్ అప్డేట్చేయడంతో మొబైల్స్ సరిగా పని చేయడం లేదని కస్టమర్లు తెలిపారు.
ఫోన్పై లైన్స్ ఏర్పడి, డిస్ ప్లే లు పని చేయడం లేదన్నారు. ఫోన్ రిపేర్కు ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇంకా రిపేర్ చేయలేదని మెహదీపట్నంకు చెందిన అస్లాం ఖాన్ తెలిపారు.