
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని రైతులకు సోమవారం సాయంత్రం రైతు భరోసా డబ్బులు సర్కార్ రిలీజ్ చేసింది. మొత్తం 1,68,371 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రూ.95.77 కోట్లు అవసరమని అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రభుత్వానికి నివేదించారు.
సీజన్ పనులు మొదలు కాకముందే పెట్టుబడి సాయం ఇస్తామని అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం సీఎం రేవంత్రెడ్డి రైతు నేస్తం ప్రోగ్రామ్ ముగిశాక రెండెకరాల్లోపు రైతుల బ్యాంక్ అకౌంట్లకు భరోసా సొమ్ము డిపాజిట్ అయినట్లు ఫోన్లకు మెసేజ్ వచ్చింది.
కామారెడ్డి జిల్లాలో...
కామారెడ్డి, వెలుగు : వానాకాలం సీజన్కు సంబంధించి రైతుల అకౌంట్లోకి సోమవారం రాత్రి నుంచి రైతు భరోసా డబ్బులు జమవుతున్నాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 2,05,731 మంది రైతులకు గాను రూ. 1,06,35,45,387 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది. రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. రైతుభరోసా అమౌంట్ జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత రైతుల అకౌంట్లలో ఎకరానికి రూ. 6వేల చొప్పున డబ్బులు జమవుతున్నాయి.