రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.92 శాతం

రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.92 శాతం

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మొత్తం 652 కేసులు నమోదైనట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. 627 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారని తెలిపింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా వల్ల ఎవరూ చనిపోలేదని పేర్కొంది. కొవిడ్ రికవరీ రేటు 98.92 శాతంగా ఉందని, గత 24 గంటల్లో మొత్తం 33,017 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు స్పష్టం చేసింది. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం 21,411 కరోనా కేసులు నమోదవగా, 67 మంది వైరస్ కారణంగా చనిపోయారు. 

జిల్లాల్లో కేసులు 

ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 15, హైదరాబాద్ లో 297, జగిత్యాల 08, జనగాం 02, జయశంకర్ భూపాలపల్లి 0, జోగులాంబ గద్వాల 01, కామారెడ్డి 01, కరీంనగర్ 28, ఖమ్మం 18, కొమరంభీం ఆసిఫాబాద్ 01, మహబూబ్ నగర్ 13, మహబూబాబాద్ 19, మంచిర్యాల 12, మెదక్ 01, మేడ్చల్ మల్కాజ్ గిరి 51, ములుగు 01, నాగర్ కర్నూలు 04, నల్గొండ 23, నారాయణపేట 05, నిర్మల్ 05, నిజామాబాద్ 03, పెద్దపల్లి 20, రాజన్న సిరిసిల్ల 09, రంగారెడ్డి 57, సంగారెడ్డి 10, సిద్ధిపేట 08, సూర్యాపేట 0, వికారబాద్ 04, వనపర్తి 06, వరంగల్ రూరల్ 02, హన్మకొండ 08, యాదాద్రి భువనగరి 14.