ఎస్​వోసీ దాఖలుకు ఐదు వారాల గడువివ్వండి

ఎస్​వోసీ దాఖలుకు ఐదు వారాల గడువివ్వండి
  • బ్రజేశ్​ ట్రిబ్యునల్​ను కోరిన తెలంగాణ సర్కార్​

హైదరాబాద్, వెలుగు: స్టేట్ ఆఫ్​కేస్​(ఎస్​వోసీ) దాఖలుకు ఐదు వారాల గడువు ఇవ్వాలని బ్రజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్​ను తెలంగాణ కోరింది. ఈ మేరకు ట్రిబ్యునల్ లో పిటిషన్​దాఖలు చేసింది. ఇంటర్​స్టేట్ వాటర్​డిస్ప్యూ ట్స్​యాక్ట్​–1956లోని సెక్షన్​–3 కింద ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పున:పంపిణీ అంశాన్ని బ్రజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్ కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎలా అన్యాయం జరిగింది, బేసిన్​పారామీటర్​, బేసిన్​వెంట నివసించే జనాభా, పరీవాహక ప్రాంతం, కరువు పీడిత ప్రాంతాలు సహా  నదీ జలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఎస్​వోసీ దాఖలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని ట్రిబ్యునల్​నీటి పంపకాలు చేయాల్సి ఉంటుంది. తమకు ఆరు వారాల సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కూడా పిటిషన్​దాఖలు చేసింది.