కేరళ : తెలంగాణ నుంచి అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లిన ఓ భక్తడు ఆకస్మికంగా మరణించాడు. జగిత్యాలకు చెందిన శ్రీగంధం రమేష్(దీక్షపరుడు) ఈనెల 9న అయ్యప్ప దర్శనానికి కేరళలోని శబరిమలకు వెళ్లారు. సోమవారం ఉదయం శబరిమలలోని పంబానది దగ్గర రమేష్ స్నానం చేస్తుండగా సడెన్ గా కుప్పకూలారు.
స్థానికులు సమీప హస్పిటల్ కి తరలించగా..బ్రెయిన్ డెడ్ తో చనిపోయాడని తెలిపారు డాక్టర్లు. రమేష్ మృతి వార్త తెలిసిన ఫ్యామిలీ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేరళ పోలీసుల సాయంతో డెడ్ బాడీని తెలంగాణకు తరలిస్తున్నట్లు తెలిపారు మృతుడి భార్య. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.