తెలంగాణ బీజేపీ ఎన్నికల హామీలను ప్రకటించింది. రిజర్వేషన్లతోపాటు రైతులు, ఆధ్యాత్మికానికి సంబంధించి ప్రజలకు కీలక హామీలు ఇచ్చింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ పార్టీ.
బీజేపీ మ్యానిఫెస్టోలో కీలక హామీలు ఇవే
* రైతులకు ప్రతి సంవత్సరం రూ.18 వేలు
* ఆడపిల్ల పుట్టగానే రెండు లక్షల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్
* కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి విచారణకు కమిటీ ఏర్పాటు
* మహిళా రైతుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు
* ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగాల నియామకాలు. యూపీఎస్సీ తరహాలో నియామకాలు, నోటిఫికేషన్లు
* ధరణి స్థానంలో మీ భూమి వ్యవస్థ ఏర్పాటు
* అర్హులైన పేదలకు ఉచితంగా ఇంటి పట్టాలు
* డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు
* ప్రతి మండలంలో నోడల్ స్కూల్స్ ఏర్పాటు
* నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ
* పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
* అధికారంలోకి రాగానే బీసీ సీఎం హామీ
* సమ్మక్క-, సారక్క మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు
* ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ
* ప్రతి రైతుకు ఉచిత పంట బీమా అమలు చేయటం
* వరికి 3 వేల 100 రూపాయల మద్దతు ధర
* పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు
* ఆసక్తి ఉన్న రైతులకు దేవీ ఆవులను ఉచితంగా అందించడం
* జాతీయ పసుపు బోర్డు నిర్ణయానికి అనుగుణంగా నిజామాబాద్ టర్మరిక్ సిటీని అభివృద్ధి చేయటం
* ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న రిజర్వేషన్లను పున:పరిశీలించి, గిరిజన వర్గాల రిజర్వేషన్లను జనాభాకు అనుగుణంగా పెంచేలా హామీ
* ఎస్సీల్లో వెనకబడిన వారికి సాధికారత కల్పించేందుకు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయటం
* ఇండోర్ తరహాలో పారిశుధ్య కార్మికులను వేస్ట్ మేనేజ్ మెంట్ లో సహ యజమానులుగా గుర్తించడం
* ప్రభుత్వ శాఖల్లోని ఎస్సీ, ఎస్టీల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయటం
* అయోధ్య, కాశీలకు వయోవృద్ధులకు ఉచిత యాత్రలు నిర్వహించటం
* దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం 25 లక్షల రూపాయల వరకు తాకట్టు లేని.. తక్కువ వడ్డీకే రుణాలు