
హైదరాబాద్: ఢిల్లీలో టీడీపీ చీఫ్ చంద్రబాబును తెలంగాణ బీజేపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఎన్నికైన రఘునందన్ రావు, గోడం నగేశ్ తదితరులు చంద్రబాబుతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నగేశ్ ను బాబు మెచ్చుకున్నారు. అప్పట్లో అతడికి తానే టికెట్ ఇచ్చానని, గెలిచి చరిత్ర సృష్టించారని భుజం తడుతూ అభినందించారు.