హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల ఆ1శల వారధిగా, ప్రగతి సారథిగా ప్రభుత్వం 2026–-27 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయి బడ్జెట్ను ఆవిష్కరించింది. అసెంబ్లీ వేదికగా శుక్రవారం ప్రవేశపెట్టిన రూ. 3,24,234 కోట్ల పద్దులో అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని సమతూకం చేసింది. వివిధ సంక్షేమ పథకాలు, గ్యారంటీలతో సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూనే.. మౌలిక వసతుల కల్పన కోసం మూలధన వ్యయం కింద ఏకంగా రూ. 47,267 కోట్లు కేటాయించింది.
