స్విగ్గీ బాయ్ ఫ్యామిలీకి రూ.2లక్షల సాయం.. చెక్ అందజేసిన సీఎం

స్విగ్గీ బాయ్ ఫ్యామిలీకి రూ.2లక్షల సాయం..     చెక్ అందజేసిన సీఎం

హైదరాబాద్, వెలుగు: నాలుగు నెలల క్రితం డ్యూటీ చేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిన స్విగ్గీ డెలివరీ బాయ్  కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు. మాట ఇచ్చిన వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి ఆర్థిక భరోసా కల్పించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి  నుంచి రూ.2లక్షల చెక్ ను శనివారం సచివాలయంలో బాధిత కుటుంబానికి అందజేశారు. 

ఈ నెల 23న గిగ్ వర్కర్స్ తో  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో  ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. సాయం చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ ప్రకారం..బాధిత కుటుంబానికి సీఎం రేవంత్​ రెడ్డి సాయం చేశారు. దీనిపై బాధిత స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబం హర్షం
వ్యక్తం చేసింది.