
- రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. భారత్–-పాక్ ఉద్రిక్తతలు, దేశంలో జరిగిన పరిణామాల దృష్ట్యా సోమవారం వీరిరువురూ సమావేశమైనట్టు సమాచారం. హైదరాబాద్ భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలను గవర్నర్కు ముఖ్యమంత్రి వివరించినట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్తో సీఎం రేవంత్ చర్చించినట్లు తెలుస్తున్నది.
శాంతి భద్రతల పరిస్థితితోపాటు సైనిక స్థావరాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై డిస్కస్చేసినట్టు సమాచారం. ఆర్టీఐ ఫైళ్ల క్లియరెన్స్ పై గవర్నర్ తో సీఎం మాట్లాడారు. ఆ వెంటనే గవర్నర్ నలుగురు కమిషనర్ల నియమాకానికి ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపడంతో సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.