ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.  సాయంత్రం హస్తినలో AICC ముఖ్య నేతలతో భేటీకానున్నారు రేవంత్. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 3 ఎంపీ సీట్లలో అభ్యర్థుల ఖరారుపై ఢిల్లీ పెద్దలతో డిస్కస్ చేయనున్నారు. మొత్తం 17 స్థానాలకు ఇప్పటివరకు 14 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది హైకమాండ్. 

ఇక ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ లీడర్లతో రేవంత్ చర్చిస్తారని తెలుస్తోంది. ఖమ్మం టికెట్ ఎవరికి దక్కుతుందోనని టెన్షన్ పార్టీలో నెలకొంది. ఈ సీటు కోసం ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.