- సీనియర్ల వైపే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మొగ్గు
- మిగతా అప్లికేషన్లను ఫిల్టర్ చేస్తున్న ఎలక్షన్ కమిటీ
- సెప్టెంబర్ 2న పీఈసీ, 4న స్ర్కీనింగ్ కమిటీ సమావేశాలు
- 40 మంది పేర్లతో ఫస్ట్ లిస్టు ప్రకటించేందుకు ఏర్పాట్లు
- ఒక్కో స్థానం నుంచి ముగ్గురి పేర్లతో త్వరలోనే హైకమాండ్కు జాబితా
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో కాంగ్రెస్ నిమగ్నమైంది. ఇప్పటికే 20 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చింది. ఆయా స్థానాల్లో టికెట్ల కోసం ఒకరికన్నా ఎక్కువ మందే అప్లికేషన్ పెట్టుకున్నా.. సీనియర్ లీడర్ల వైపే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (పీఈసీ) మొగ్గు చూపుతున్నది. మంగళవారం గాంధీ భవన్లో పీసీసీ చీఫ్రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ కమిటీ సమావేశమైంది. టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించింది. మూడున్నర గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఫస్ట్ లిస్టును 40 మంది పేర్లతో ప్రకటించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
సెప్టెంబర్ రెండో తేదీన మరోసారి సమావేశమై టికెట్ల ఖరారుపై చర్చించాలని నేతలు నిర్ణయించారు. నాలుగో తేదీన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్దిఖీ, జిగ్నేశ్ మేవానీ, ఎక్స్ అఫీషియో సభ్యులు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మాణిక్ రావ్ ఠాక్రే సమావేశం కానున్నారు. వచ్చిన దరఖాస్తుల్లో బలమైన ముగ్గురు ముఖ్య నేతల పేర్లతో కాంగ్రెస్ హైకమాండ్కు లిస్ట్ పంపనున్నారు. వారిలో నియోజకవర్గానికి ఒకరి పేరు చొప్పున ఏఐసీసీ ఖరారు చేయనుంది.
వెయ్యి మందికి పైగా ఆశావహులు
ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న లీడర్ల నుంచి కాంగ్రెస్ ఇటీవల దరఖాస్తులు స్వీకరించింది. 119 స్థానాలకు వెయ్యి మందికి పైగా అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ అప్లికేషన్లను పరిశీలించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ.. వాటిలో సగం అప్లికేషన్లను పక్కన పెట్టింది. ఆయా సీట్లు ఆశిస్తున్న బలమైన అభ్యర్థులతో షార్ట్ లిస్ట్ రూపొందించింది. 20 స్థానాల్లో పోటీ చేయబోయే క్యాండిడేట్లను స్క్రీనింగ్ కమిటీ దాదాపు ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపికపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందిస్తూ.. నల్గొండ సీటును ఆశిస్తూ తనతో పాటు ఆరుగురు నేతలు అప్లికేషన్ పెట్టుకున్నారని, బలమైన నేతలను కమిటీ ఎంపిక చేస్తుందన్నారు. బీసీల కోసం అవసరమైతే తన సీటు త్యాగానికి సిద్ధమని చెప్పారు. 20 సీట్ల విషయంలో దాదాపు ఏకాభిప్రాయం రాగా.. ఇంకో 36 సీట్లకు ఇద్దరు, ముగ్గురేసి నేతలు పోటీలో ఉన్నారు.
ఆ స్థానాలను ఖరారు చేసే ప్రక్రియ కూడా రెండు, మూడు రోజుల్లో తుది దశకు చేరుకోనుంది.ఈ సెగ్మెంట్లలో ఎక్కువ పోటీ36 సీట్లకు ఇద్దరు, ముగ్గురేసి బలమైన లీడర్లతో షార్ట్ లిస్ట్ రెడీ చేశారు. ఈ పేర్లనే ఏఐసీసీకి పంపడానికి స్క్రీనింగ్కమిటీ రెడీ అవుతున్నది. దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. మిగతా 63 స్థానాలకు మూడో విడతలో అభ్యర్థులను ప్రకటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నది. వనపర్తి టికెట్ కోసం మాజీ మంత్రి చిన్నారెడ్డి, యూత్కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డితో పాటు మేఘా రెడ్డి పోటీ పడుతున్నారు. ఇల్లందు స్థానాన్ని భద్రాద్రి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో పాటు చీమల వెంకటేశ్వర్లు ఆశిస్తున్నారు. మహబూబాబాద్ కోసం మాజీ మంత్రి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, మురళీ నాయక్ పోటీ పడుతున్నారు. జనగామ టికెట్ను మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆశిస్తున్నారు.
షాద్నగర్ సీటుకు ఈర్లపల్లి శంకర్, ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ పోటీ పడుతున్నారు. కొల్లాపూర్ స్థానాన్ని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్ రావు ఆశిస్తున్నారు. హుస్నాబాద్ టికెట్ కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు. వరంగల్ వెస్ట్సీటును నాయిని రాజేందర్రెడ్డి, జంగా రాఘవ రెడ్డి ఆశిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ స్థానానికి ఇందిర, దొమ్మాటి సాంబయ్య పోటీ పడుతున్నారు. మునుగోడు స్థానాన్ని పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణా రెడ్డి, పున్న కైలాశ్ నేత ఆశిస్తున్నారు.
ఎల్బీ నగర్నుంచి మధుయాష్కీ గౌడ్, మల్రెడ్డి రాంరెడ్డి, కల్వకుర్తి నుంచి వంశీచంద్రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస్రెడ్డి, గండ్రత్ సుజాత, ఎల్లారెడ్డి నుంచి సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు పోటీ పడుతున్నారు. జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, అజారుద్దీన్, ఖైరతాబాద్ నుంచి రోహిణ్ రెడ్డి, విజయా రెడ్డి, సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి, పటేల్రమేశ్ రెడ్డి, మిర్యాలగూడ నుంచి రఘువీర్ రెడ్డి, బి. లక్ష్మారెడ్డి, దేవరకొండ నుంచి బాలూ నాయక్, వడ్త్యా రమేశ్నాయక్, కిషన్ నాయక్, మక్తల్నుంచి శ్రీహరి, నాగరాజు గౌడ్, గద్వాల నుంచి సరితా తిరుపతయ్య, రాజీవ్రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి పోటీ పడుతున్నారు.
మేడ్చల్ టికెట్ తోటకూర జంగయ్య యాదవ్, హరివర్ధన్రెడ్డి, ఉప్పల్ టికెట్రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ టికెట్ భూపతిరెడ్డి నర్సారెడ్డి, కొలను హన్మంత్రెడ్డి, ముషీరాబాద్ సీటు అంజన్కుమార్యాదవ్, సంగిశెట్టి జగదీశ్వర్ రావు, మలక్పేట సీటు చెక్లోకర్ శ్రీనివాస్, అశ్వక్, గోషామహల్ స్థానం మెట్టు సాయికుమార్, ప్రేమ్లాల్, సనత్నగర్ సీటు కోట నీలమ, మర్రి ఆదిత్య రెడ్డి, శేరిలింగంపల్లి స్థానం జర్పెటీ జైపాల్, సత్యనారాయణరావు, తుంగతుర్తి స్థానం అద్దంకి దయాకర్, జ్ఞానసందర్, ప్రీతమ్, డోర్నకల్సీటు రామచంద్రు నాయక్, నెహ్రూ నాయక్, నారాయణ ఖేడ్ సీటు సురేశ్షెట్కర్, సంజీవ రెడ్డి, కూకట్పల్లి స్థానం శ్రీరంగం సత్యం, వెంగల్రావు, కొత్తగూడెం సీటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పోట్ల నాగేశ్వర్రావు, ఎడవెల్లి కృష్ణ, సత్తుపల్లి టికెట్సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్ ఆశిస్తున్నారు.
ఖరారైన నియోజకవర్గాలు ఇవే!
కొడంగల్ అసెంబ్లీ సీటుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్కరే అప్లికేషన్ పెట్టుకోవడంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. హుజూర్నగర్ సీటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోదాడ నుంచి ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంథని నుంచి ఎమ్మెల్యే శ్రీధర్బాబు, జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ములుగు నుంచి ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం నుంచి ఎమ్మెల్యే పోదెం వీరయ్య, సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నల్గొండ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఆలంపూర్ నుంచి సంపత్ కుమార్, నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్రెడ్డి, వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ, మంచిర్యాల నుంచి ప్రేమ్సాగర్ రావు, ఆంథోల్ నుంచి దామోదర రాజనర్సింహా, పరిగి నుంచి రామ్మోహన్రెడ్డి, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్, ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య యాదవ్ పేర్లు దాదాపు ఖరారు అయ్యాయి.
స్టూడెంట్లకిచ్చిన హామీ నిలబెట్టుకోండి
తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కోరారు. మంగళవారం రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్ను గాంధీ భవన్లో కలిసి వారు వినతిపత్రం అందజేశారు. 2014లో ఉద్యమకారులకు ఒక ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్లను టీఆర్ఎస్పార్టీ ఇచ్చిందని, 2018లో మూడు ఎమ్మెల్యే సీట్లతో పాటు 30 కార్పొరేషన్ చైర్మన్ పదవులను విద్యార్థి ఉద్యమకారులకు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్పార్టీ సైతం విద్యార్థి ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కోటూరి మానవతారాయ్ (సత్తుపల్లి), దుర్గం భాస్కర్ (చెన్నూరు), బాల లక్ష్మి (జనగామ), కురువ విజయ్కుమార్(గద్వాల), డాక్టర్లింగం (మునుగోడు), కొనగాల మహేశ్(కరీంనగర్) ఉన్నారు.