24 గంటల్లో 28 కరోనా కేసులు.. కోలుకున్న 62 మంది

24 గంటల్లో 28 కరోనా కేసులు.. కోలుకున్న 62 మంది

భారతదేశంలో కరోనాకి ఇంకా చెక్ పడడం లేదు. తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా.. వైరస్ మాత్రం కొనసాగుతోంది. ఇతర దేశాల్లో విజృంభిస్తోంది. దేశంలో ని వివిధ రాష్ట్రాల్లో రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. తెలంగాణలో గత 24 గంటల్లో 28కేసులు నమోదయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 62 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 7, 88, 142 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి  ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 99.43 శాతంగా ఉందని, మొత్తం 12 వేల 435 టెస్టులు నిర్వహించడం జరిగిందని పేర్కొంది. 

ఏ జిల్లాలో ఎన్ని కేసులు : 
ఆదిలాబాద్ 01, భద్రాద్రి కొత్తగూడెం 0, హైదరాబాద్ లో 18, జగిత్యాల 02, జనగాం 00, జయశంకర్ భూపాలపల్లి 00, జోగులాంబ గద్వాల 00, కామారెడ్డి 00, కరీంనగర్ 01, ఖమ్మం 00, కొమరంభీం ఆసిఫాబాద్ 00, మహబూబ్ నగర్ 00, మహబూబాబాద్ 00, మంచిర్యాల 00, మెదక్ 01, మేడ్చల్ మల్కాజ్ గిరి 01, ములుగు 00, నాగర్ కర్నూలు 01, నల్గొండ 00, నారాయణపేట 00, నిర్మల్ 00, నిజామాబాద్ 00, పెద్దపల్లి 00, రాజన్న సిరిసిల్ల 00, రంగారెడ్డి 03, సంగారెడ్డి 00, సిద్ధిపేట 00, సూర్యాపేట 00, వికారాబాద్ 00, వనపర్తి 00, వరంగల్ రూరల్ 00, హన్మకొండ 00, యాదాద్రి భువనగరి 00. మొత్తం - 28

మరిన్ని వార్తల కోసం : -

కరీంనగర్ అదనపు కలెక్టర్ కు టీఆర్ఎస్ కార్పొరేటర్ ఫిర్యాదు


నేను ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశా.. నా కన్నా కేసీఆర్ పెద్దనటుడు