ఉప్పల్ స్టేడియంలో హోరెత్తిన తెలంగానం

ఉప్పల్ స్టేడియంలో హోరెత్తిన తెలంగానం

ఉప్పల్ ​స్టేడియంలో టీజీ 20 లీగ్​లో గురువారం ఫోర్లు, సిక్సర్ల వర్షమే కాదు.. అచ్చమైన తెలంగాణ సాంస్కృతిక వైభవం వెల్లివిరిసింది. ‘క్రికెట్​ మీట్స్​ కల్చర్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒగ్గుడోలు, డప్పుల ప్రదర్శన ఆకట్టుకుంది. సింగర్లు మధుప్రియ, భోలే శావలి, హన్మంతు, మౌనికా యాదవ్, స్వప్న, శిరీష తమ పాటలతో ఉర్రూతలూగించారు. 

కరీంనగర్ డైమండ్స్, రంగారెడ్డి రైజర్స్​ మధ్య మ్యాచ్​ జరగ్గా కరీంనగర్ డైమండ్స్ 75 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి క్వాలిఫయర్-2కు దూసుకెళ్లింది. కరీంనగర్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ 61 బంతుల్లో137 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 
- హైదరాబాద్ సిటీ, వెలుగు