డీఫాల్ట్ మిల్లర్లు సీఎంఆర్ క్లియర్ చేయాలి : డీఎస్​ చౌహాన్

డీఫాల్ట్ మిల్లర్లు సీఎంఆర్ క్లియర్ చేయాలి : డీఎస్​ చౌహాన్

వనపర్తి, వెలుగుః  వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉన్న రైస్ మిల్లులు సగానికి పైగా డీఫాల్ట్ అయి ఉండటం ధాన్యం సేకరణకు ప్రధాన  కారణంగా మారిందని రాష్ట్ర సివిల్​ సప్లయ్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ డీఎస్​ చౌహాన్​ అన్నారు.   మంగళవారం  కలెక్టరేట్​ మీటింగ్​ హాలులో  ధాన్యం కొనుగోలుపై వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లా అధికారులు, మిల్లర్లు, ఐకేపీ, పీఎసీఎస్  కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 

   సీఎంఆర్ క్లియర్ చేసి మిల్లింగ్ కొనసాగించాలని ప్రభుత్వం ఇచ్చిన వడ్లు తీసుకోకుండా ప్రైవేటుగా వడ్లు తీసుకొని మిల్లింగ్ చేసే రైస్ మిల్లర్లపై  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ..  ఈసారి  వనపర్తి జిల్లాలో అత్యధికంగా వరి పండిందని తెలిపారు.  ఎస్పీ రావుల గిరిధర్,  ఏడీసీ  వెంకటేశ్వర్లు, నాగర్ కర్నూల్ ఏడీసీ అమరేందర్,  వనపర్తి  సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డీఎంలు, జిల్లా అధికారులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.